మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఒక పాత కోసం ఈ చిత్ర బృందం శ్రీలంకకు బయలు దేరింది. రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట ప్రత్యేకమైన లొకేషన్లలో చిత్రీకరించబడుతుంది . ఇప్పటివరకు భారత సినిమాల్లో చూపించని దృశ్యాలు ఈ సాంగ్లో ఉండబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది.
ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ అయింది. చరణ్ లుక్స్, రగ్డ్ యాక్షన్ స్టైల్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచాయి. శివరాజ్కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బుచ్చి బాబు కథా రచన ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ది మార్చి 27, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
కామెంట్స్
ఇంకా కామెంట్స్ లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!